ఢిల్లీలో హై అలెర్ట్ భద్రతా బలగాలు మోహరింపు..!!

ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముందే దేశ రాజధాని ఢిల్లీలో డ్రోన్లతో ఉగ్ర దాడులు జరిగే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి.

ఆగస్టు 5వ తారీఖు జమ్ము కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370 తొలగించిన రోజు.

నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో.ఉగ్రవాదుల అశాంతిని నెలకొల్పటానికి రెడీ అయినట్లు ఇంటిలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి.

పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు ఈ ఘాతుకానికి పాల్పడి అవకాశం ఉన్నట్లు ఇంటిలిజెన్స్ ఢిల్లీ పోలీసులను హెచ్చరించాయి.

దీంతో ఢిల్లీలో ఎక్కడికక్కడ హైఅలర్ట్ ప్రకటించడం జరిగింది.భద్రతా బలగాలు ఎక్కడికక్కడ భారీగా మోహరించి.తనిఖీలు చేస్తున్నారు.

Advertisement

మరోపక్క పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కూడా జరుగుతూ ఉండటంతో ఢిల్లీ పోలీసులు ప్రత్యేక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.ఏది ఏమైనా ఆగస్టు 15వ తారీకు స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముందే ఢిల్లీలో భారీగా ఉగ్రవాద దాడి జరిగే అవకాశం ఉన్నట్లు ఇంటిలిజెన్స్ వర్గాలు ఢిల్లీ పోలీసులను హెచ్చరించాయి.

 దీంతో ఢిల్లీ పోలీసులు ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

Advertisement

తాజా వార్తలు