ఆ విషయాన్ని ఒప్పుకున్న సుశాంత్..!

అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చిన హీరో సుశాంత్ చిలసౌ సినిమా నుండి తన పంథా మార్చుకున్నాడు.

చిలసౌ, అల వైకుంఠపురములో సినిమాలతో అలరించిన సుశాంత్ లేటెస్ట్ గా ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో వస్తున్నాడు.

ఈ సినిమాను నూతన దర్శకుడు దశన్ డైరెక్ట్ చేశారు.నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు సుశాంత్.

శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుశాంత్ స్పీచ్ అందరిని సర్ ప్రైజ్ చేసింది.కెరియర్ మొదట్లో తనకు మెచ్యురిటీ అంతగా లేక ఏది వస్తే ఆ సినిమా చేశానని.

సినిమా అంటే కొన్ని లెక్కలు అప్పుడు ఉండేవని.చినమామ (నాగార్జున) చిలసౌ ముందు నీకంటూ ఒక ఐడెంటిటీ వచ్చేలా ట్రై చెయి.

Advertisement

అలాంటి కథలే చెయ్ అని చెప్పగానే చిలసౌతో అది మొదలైందని అన్నారు.

పెద్ద ఫ్యామిలీ హీరోగా కెరియర్ మొదట్లో కమర్షియల్ సినిమాలే చేశానని ఒప్పుకున్నారు సుశాంత్.అయితే ఇప్పుడు కంటెంట్ ఉన్న సినిమాలతో ప్రేక్షకులను మెప్పించడానికి వస్తున్నారు.ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమా కూడా అదే కోవలో వస్తుందని అంటున్నారు.

మరి ఈ సినిమా సుశాంత్ కు ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు