ఇండియాకు తిరిగి వచ్చేశా, కోలుకుంటున్నాను.. హీరో సిద్దార్ద్?

దక్షిణాది సినీ హీరోలలో ఒకరైన సిద్దార్ద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

నిత్యం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ వివాదాస్పదమైన ట్వీట్స్ చేస్తూ ఇటు ఇండస్ట్రీ పరంగా అటు రాజకీయ పరంగా తీవ్ర వివాదాలను సృష్టిస్తుంటారు.

ఇలా ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో ఉండే సిద్దార్ద్ చాలా రోజుల తర్వాత మహా సముద్రం అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను సందడి చేయబోతున్నారు.అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించినప్పుడు సిద్ధార్థ ప్రమాదానికి గురయ్యారు.

ఈ ప్రమాదంలో భాగంగా సిద్దార్ద్ వెన్నెముకకు గాయం కావడంతో అతను లండన్ వెళ్లి చికిత్స తీసుకున్నారు.లండన్ లో చికిత్స పూర్తి చేసుకున్న సిద్ధార్థ్ తిరిగి ఇండియాకి తిరిగి వచ్చాడు.

ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఇండియాకు తిరిగి వచ్చాను కోలుకుంటున్నానని చెప్పడమే కాకుండా ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటూ మహా సముద్రం సినిమా డబ్బింగ్ కార్యక్రమాలలో పాల్గొన్న విషయాన్ని తెలియజేశారు.

Advertisement

చాలా రోజుల నుంచి సినిమా ఇండస్ట్రీకి దూరమైన సిద్దార్ద్ ప్రస్తుతం శర్వానంద్ తో కలసి, అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహా సముద్రం సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్,ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని సినిమాపై అంచనాలు పెంచాయి.త్వరలోనే డబ్బింగ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొని ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు