అమ్మ బాబోయ్ : బాలయ్య బాబు ఏకంగా ఆ జిల్లా కలెక్టర్ ని లవ్ చేస్తున్నాడంట...

తెలుగులో ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఓ చిత్రంలో హీరోగా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.

అయితే ఈ చిత్రంలో హీరోయిన్లుగా తెలుగు యంగ్ హీరోయిన్ "ప్రగ్యా జైస్వల్" మరియు పూర్ణ లు నటిస్తుండగా తమిళ ప్రముఖ నటుడు శరత్ కుమార్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు.

అయితే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనుల నిమిత్తం చిత్ర యూనిట్ సభ్యులు కర్ణాటక రాష్ట్రంలోని దండేలి అడవులకు వెళ్లినట్లు సమాచారం.కాగా ఇందులో భాగంగా దాదాపు ఐదు రోజుల పాటు దండేలి అడవులలో షూటింగ్ నిర్వహించనున్నారట.

కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ విషయం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.అయితే ఇంతకీ ఆ విషయం ఏమిటంటే హీరో నందమూరి బాలకృష్ణ తో జిల్లా కలెక్టర్ ప్రేమలో పడ్డాడని నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు.

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న ప్రగ్యా జైస్వల్ ఓ జిల్లా కలెక్టర్ పాత్రలో నటిస్తోందని, ఆమె నిజాయితీ మరియు చేసేటువంటి మంచి పనుల కారణంగా నందమూరి బాలకృష్ణ ఆమె ప్రేమలో పడతాడని ఈ చిత్రంలో వీరి ప్రేమకు సంబంధించిన సన్నివేశాలు హైలెట్ గా నిలువనున్నాయని టాలీవుడ్ సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.దీంతో నందమూరి బాలకృష్ణ అభిమానులు ఈ చిత్ర అప్డేట్ల గురించి తెలియడంతో పండగ చేసుకుంటున్నారు.

Advertisement

ఈ విషయం ఇలా ఉండగా ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి దాదాపుగా 50 శాతం చిత్రీకరణ పనులు పూర్తి అయినప్పటికీ ఈ చిత్ర టైటిల్ విషయంపై మాత్రం చిత్ర యూనిట్ సభ్యులుగానీ దర్శకుడు బోయపాటి శ్రీనుగానీ ఎలాంటి అప్డేట్స్ ఇవ్వడం లేదు.దీంతో నందమూరి బాలకృష్ణ అభిమానులు కొంతమేర దర్శకుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కాగా ఈ చిత్రానికి దర్శకుడు బోయపాటి శ్రీను మోనార్క్ లేదా ధర్మ అనే రెండు టైటిళ్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

అయితే ఈ చిత్రాన్ని మే నెలలో విడుదల చేసేందుకు దర్శకుడు సన్నాహాలు చేస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు