మేము విడిపోయామని ఎలా అనుకుంటారు.. హేమా మాలిని షాకింగ్ కామెంట్స్ వైరల్!

ప్రముఖ బాలీవుడ్ నటి హేమా మాలిని( Hema Malini ) గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

తాజాగా ఈ నటి ఒక సందర్భంలో సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

తమ కుటుంబం గురించి ఈ మధ్య కాలంలో ప్రచారంలోకి వస్తున్న వార్తల గురించి హేమా మాలిని తాజాగా రియాక్ట్ అయ్యారు.తన భర్త ధర్మేంద్ర( Dharmendra ), మొదటి భార్య కుటుంబంతో తాము కలిసే ఉన్నామని ఆమె చెప్పుకొచ్చారు.

మేము విడిపోయామని బయటి వాళ్లు అనుకోవడం కామెడీగా ఉందని ఆమె చెప్పుకొచ్చారు.ధర్మేంద్ర మొదటి భార్య కుటుంబంతో మేము ఎప్పుడూ కలిసే ఉన్నామని హేమా మాలిని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఆ ఫ్యామిలీ మాతోనే ఉందని హేమా మాలిని చెప్పుకొచ్చారు.కొన్ని కారణాల వల్ల మేము సన్ని కొడుకు పెళ్లికి హాజరు కావడం సాధ్యం కాలేదని హేమా మాలిని అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.

Advertisement

అది వేరే విషయమని ఆ విషయానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం అయితే లేదని ఆమె చెప్పుకొచ్చారు.రక్ష బంధన్( Raksha Bandhan ) పండుగ సమయంలో సన్నీ, బాబీ ( Sunny, Bobby )మా ఇంటికి వస్తుంటారని ఆమె కామెంట్లు చేశారు.నా పిల్లలు వాళ్లకు రాఖీ కడుతుంటారని ఇది మాకు కొత్త విషయం కాదని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.

హేమా మాలిని చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హేమా మాలిని క్లారిటీతో ఇకనైనా ఈ కామెంట్లు ఇకనైనా ఆగిపోతాయేమో చూడాల్సి ఉంది.1980 సంవత్సరంలో ధర్మేంద్ర హేమా మాలిని వివాహం జరిగింది.ధర్మేంద్ర హేమా మాలినిని రెండో వివాహం చేసుకున్నారు.

ధర్మేంద్ర మొదటి భార్య కుమారుడు సన్నీ ఇంట తాజాగా జరిగిన వేడుకకు హేమా మాలిని ఫ్యామిలీ హాజరు కాలేదు.హేమా మాలిని ఫ్యామిలీ తీరుపై విమర్శలు రావడంతో ఆమె స్పందించి క్లారిటీ ఇచ్చారు.

ఆ విధంగా జరగకపోతే ప్రమాదంలో కళ్యాణ్ రామ్ కెరీర్.. ఆ రేంజ్ హిట్ అందుకుంటారా?
Advertisement

తాజా వార్తలు