ట్రోల్స్ అనేవి ఎక్కువగా నటినటులకే ఎదురవుతుంటాయి.ఎందుకంటే కొందరు నటి నటుల ప్రవర్తన అలా ఉంటుంది కాబట్టి.
కొన్నిసార్లు వాళ్ళు ధరించే దుస్తుల పట్ల, వాళ్లు మాట్లాడే మాట తీరుపట్ల కూడా బాగా విమర్శిస్తూ ఉంటారు.ఇక ఈ మధ్య సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి ఇక వెంటనే వారిని ట్రోల్ చేసేస్తున్నారు.
వారికి సంబంధించిన ఫోటోలు వచ్చినా కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఏదో ఒకలా ట్రోల్స్ చేస్తున్నారు.తాజాగా హెబ్బా పటేల్ కు ట్రోలింగ్ ఎదురైంది.
అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన బ్యూటీ హెబ్బా పటేల్.
ఈమె గురించి తెలుగు ప్రేక్షకులందరికీ బాగా పరిచయమని చెప్పాలి.ఈ బ్యూటీ తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ సినిమాలలో కూడా నటించింది.
తన అందంతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది.సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది హెబ్బా.
తనకు సంబంధించిన ఫోటోలతో బాగా రచ్చ రచ్చ చేస్తుంది.
హెబ్బా తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి 2014లో పరిచయం అయింది.
ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీకి కుమారి 21ఎఫ్ తో పరిచయం అయింది.ఈ సినిమాలో తన తొలి నటనతో మంచి సక్సెస్ అందుకుంది.
ఆ తర్వాత పలు సినిమాలలో అవకాశాలు అందుకుంది.కానీ అంతగా మెప్పించలేకపోయింది.
ఒరేయ్ బుజ్జి సినిమాలో కూడా నటించగా ఈ సినిమా కూడా అంతగా మెప్పించలేకపోయింది.
ఇక పలు సినిమాలలో స్పెషల్ సాంగ్ లో కూడా నటించింది.కానీ ఇప్పుడు మాత్రం ఈ అమ్మడును పట్టించుకునే వాళ్లే లేరు.కొత్త హీరోయిన్లు రావడంతో ఈమెను దర్శక నిర్మాతలు పక్కకు పెట్టారు.
ఇక ఇదంతా పక్కన పెడితే అవకాశాల కోసం ఈ ముద్దుగుమ్మ తెగ ఆరాట పడుతుంది.పైగా తన గ్లామర్ ని పూర్తిగా పరిచయం చేసింది.
హాట్ లుక్ లతో సోషల్ మీడియా ను షేక్ చేస్తోంది.మొత్తానికి అవకాశం కోసం సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోస్తుంది.
అప్పుడప్పుడు తన వ్యక్తిగత విషయాలను బాగా పంచుకుంటూ ఉంటుంది.తనకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టా లో కొన్ని ఫోటోలు పంచుకుంది.అందులో కాస్త గ్లామర్ షో చేసింది.తన థైస్ అందాలతో, ఎద అందాలతో బాగా రెచ్చిపోయింది.అంతేకాకుండా నడుము పై చేతులు పెట్టుకొని ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.
ఆ ఫోటోలు బాగా వైరల్ అవ్వగా.అభిమానులు ఆ ఫోటోలను చూసి బాగా లైక్స్ కొడుతున్నారు.
ఇక కొంతమంది మాత్రం బాగా ట్రోల్ చేస్తున్నారు. ఏంటి నడుమునొప్పా అంటూ ఆమె ఇచ్చిన స్టిల్స్ కు బాగా ట్రోల్స్ చేస్తున్నారు.