ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో గోదావరి ఉగ్రరూపాన్ని దాల్చుతోంది.ఈ క్రమంలో పోలవరం ప్రాజెక్టుకు నీటి ప్రవాహం భారీగా పెరుగుతోంది. ప్రాజెక్టు ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 12.20 లక్షల క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు.మరోవైపు కడెమ్మ కెనాల్ లోకి గోదావరి నీరు భారీగా చేరింది.
ప్రాజెక్టుకు వెళ్లేందుకు వీలు లేకుండా కడెం కెనాల్ వంతెన నీట మునిగింది.దీంతో అధికారులు పోలవరం ప్రాజెక్టు వైపు ఎవరూ వెళ్లకుండా చెక్ పోస్టు ఏర్పాటు చేశారు.అదేవిధంగా నీటి ప్రవాహం మరింతగా పెరిగే అవకాశం ఉందని, ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.