టీపీసీసీ చీఫ్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది.

యాత్ర సందర్భంగా అదనపు సెక్యూరిటీ కోరుతూ రేవంత్ రెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

రేవంత్ పాదయాత్ర జరిగే ప్రాంతాల్లో ఇప్పటికే భద్రత కల్పిస్తున్నట్లు ప్రభుత్వ తరపు న్యాయవాది ధర్మాసనానికి వివరించారు.భద్రత కల్పించాలని జిల్లాల ఎస్పీలకు డీజీపీ ఆదేశించారన్న ప్రభుత్వ లాయర్ ఫ్యాక్స్ కాపీని న్యాయస్థానానికి సమర్పించారు.

డీజీపీ ఆదేశాలకు అనుగుణంగా భద్రత ఇస్తున్నారా అని హైకోర్టు ప్రశ్నించింది.అనంతరం తదుపరి విచారణను మార్చి 6కు వాయిదా వేసింది.

దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?
Advertisement

తాజా వార్తలు