ఆటోగ్రాఫ్ అడిగి పచ్చబొట్టు వేయించుకున్నాడు.. రాశిఖన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్?

ఊహలు గుసగుసలాడే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు నటి రాశి ఖన్నా.

మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ అనంతరం తెలుగులో ఎన్నో సినీ అవకాశాలను అందుకొని తెలుగు ప్రేక్షకులను సందడి చేశారు.

ప్రస్తుతం ఈమె తెలుగులోనే కాకుండా తమిళం హిందీ భాషలలో కూడా వరుస సినిమాలు వెబ్ సిరీస్ లతో ఎంతో బిజీగా గడుపుతుంది.ఇకపోతే తాజాగా ఏమి నటించినా పక్కా కమర్షియల్ సినిమా ఈనెల 1వ తేదీ విడుదల అయింది.

మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో గోపీచంద్, రాశిఖన్నా జంటగా నటించారు.ఇక ఈ సినిమా మొదటి షో తోనే ఎంతో మంచి విజయాన్ని అందుకుంది.

ఇకపోతే ఈ సినిమా విడుదలైన అనంతరం రాశికన్నా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ క్రమంలోనే ఈమె ఎన్నో విషయాలను ఈ సందర్భంగా వెల్లడించారు.

Advertisement

ఇప్పటివరకు తన కెరీయర్లో నటించిన సినిమాలలో కెల్లా తనకు వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలోని యామిని పాత్ర అంటే తనకు చాలా ఇష్టమని ఈ సందర్భంగా రాశి ఖన్నా వెల్లడించారు.ఇకపోతే భవిష్యత్తులో మరెన్నో అద్భుతమైన పాత్రలలో నటించాలని ఉందని ఈ సందర్భంగా ఈమె వెల్లడించారు.

తాను నటిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తర్వాత తనకు ఎంతో మంది అభిమానులు వచ్చారని తెలుపుతూ ఓ అభిమాని తన పట్ల చూపిన అభిమానం గురించి బయటపెట్టారు.ప్రతిరోజు పండగలే సినిమా షూటింగ్ రాజమండ్రిలో జరుగుతోంది.ఆ సమయంలో ఓ కుర్రాడు తన వద్దకు వచ్చి తన ఆటోగ్రాఫ్ ఇవ్వాలని చేయి చాచాడు.

తన చేతి పై సంతకం చేయగా వెళ్లి నా సంతకాన్ని పచ్చబొట్టుగా వేయించుకొని వచ్చాడు.ఆ క్షణం నాకెంతో ఆనందం వేసిందని,అభిమానులు చూపించే ప్రేమకు తాను ఎప్పుడు కృతజ్ఞురాలిని అంటూ ఈ సందర్భంగా రాశి ఖన్నా వెల్లడించారు.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?
Advertisement

తాజా వార్తలు