పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రెజెంట్ వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు.కానీ ఆ సినిమాలను మాత్రం పూర్తి చేయడం లేదు.
వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలతో వరుస హిట్ లు కొట్టిన పవన్ ఆ తర్వాత మాత్రం మరో సినిమాను పూర్తి చేయలేదు.ఇక గత కొన్ని రోజుల నుండే రాజకీయాలకు విరామం ఇచ్చి సినిమాల షూటింగులతో బిజీ అవుతున్నాడు.
ప్రెజెంట్ పవన్ కళ్యాణ్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి.అందులో హరిహర వీరమల్లు సినిమా ఒకటి.
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా ఇప్పటికే సగానికి పైగానే షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది.ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.
కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.మెగా సూర్య ప్రొడక్షన్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
మొదటిసారిగా పవన్ పీరియాడిక్ యాక్షన్ సినిమాలో నటిస్తుండడం అలాగే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటం వల్ల ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంతా ఎదురు చూస్తున్నారు.ఇదిలా ఉండగా ఇది పాన్ ఇండియా సినిమా కావడంతో క్రిష్ ఆ రేంజ్ లోనే నటులను సెలెక్ట్ చేసుకుంటున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ కూడా నటిస్తున్నట్టు ఇటీవలే ప్రకటించారు.ఇక తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ గురించి ఒక అప్డేట్ బయటకు వచ్చింది.
హైదరాబాద్ లో వేసిన ఒక ప్రత్యేకమైన సెట్ లో పవన్ కళ్యాణ్ బాబీ డియోల్ కు సంబంధించిన కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించడానికి క్రిష్ పక్కా ప్లాన్ తో సిద్ధం అయినట్టు తెలుస్తుంది.మరి ఈ షెడ్యూల్ దాదాపు రెండు వారాలపాటు కొనసాగే ఈ షూటింగ్ లో పవన్ కళ్యాణ్ ఒక పది రోజులపాటు బిజీ కానున్నట్టుగా తెలుస్తుంది.