పవన్ తో 'వీరమల్లు' షూట్ పై చర్చించిన క్రిష్ !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో మరొకసారి వెండితెరపై కనిపించి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు.అందులో హరి హర వీరమల్లు సినిమా ఒకటి.కరోనా సెకండ్ వేవ్ కంటే ముందే ఈ సినిమా దాదాపు 45 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.

కానీ సెకండ్ వేవ్ తర్వాత మళ్ళీ ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు.ఈ సినిమా అలా ఉండగానే పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా షూటింగ్ పూర్తి చేసే పనిలో పడ్డాడు.

మరి హరిహర వీరమల్లు సినిమాను త్వరలోనే సెట్స్ మీదకు తీసుకు వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తో దర్శక నిర్మాతలు క్రిష్ జాగర్లమూడి, ఏ ఎం రత్నం భేటీ అయ్యారు.

భీమ్లా నాయక్ పశూట్ చివరి దశలు ఉన్న నేపథ్యంలో ఈ సినిమా పూర్తి అవ్వగానే హరిహర వీరమల్లు సినిమా షూట్ ను స్టార్ట్ చెయ్యాలని సన్నాహాలు చేస్తున్నారు.అందుకే ఈ సినిమాలో కీలక సన్నివేశాల గురించి పాటలు, ఫైట్స్, లొకేషన్స్, సెట్స్ వంటి విషయాలు గురించి పవన్ తో దర్శక నిర్మాతలు చర్చలు జరిపారు.

ఈ సినిమా హిస్టారికల్ సినిమాగా తెరకెక్కుతున్న నేపథ్యంలో భారీ సెట్టింగ్స్ వేయాల్సి ఉంటుంది.అందుకే ఈ విషయాలపై చర్చించు కున్నట్టు సమాచారం.ఇప్పటికే 50 శాతం షూట్ పూర్తి అయిందని మిగిలిన భాగాన్ని త్వరలోనే ప్రారంభించి బ్రేక్ లేకుండా పూర్తి చేస్తామని నిర్మాత తెలిపారు.

మొన్న పవన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను 2022 ఏప్రిల్ 29న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.అందుకే ఈ సినిమాను అనుకున్న సమయంలోనే పూర్తి చేసి విడుదల చేయాలనీ భావిస్తున్నారు.ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎన్ని రికార్డులను సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

తాజా వార్తలు