అసెంబ్లీ నిర్వహణపై నిర్వహించిన సమీక్షలో తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఎమ్మెల్సీలకు ప్రొటోకాల్ పాటించడం లేదంటూ అధికారులపై మండిపడ్డారు.
ఈ నేపథ్యంలో ఇద్దరు ఎమ్మెల్సీలకు అవమానం జరిగిందని ఫిర్యాదు చేసినట్లు గుత్తా తెలిపారు.అయితే కంప్లైంట్ ఇచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
అనంతరం స్వయంగా తనకే కొన్నిసార్లు అవమానం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.జిల్లాల్లో ఎమ్మెల్సీల ప్రొటోకాల్ పాటించడం లేదని ఫైర్ అయ్యారు.
ఒకరిద్దరిపై చర్యలు తీసుకుంటే అంతా సెట్ అవుతుందని స్పష్టం చేశారు.