యూత్ విహార యాత్రకు వెళ్లాలి అంటే ఎక్కువగా ఎంచుకునే ప్లేస్ గోవా.భారతదేశం మొత్తం నుండి కూడా గోవాకు అత్యధిక పర్యాటకులు వెళ్తూ ఉంటారు.
జీవితంలో ఒక్కసారైనా గోవా వెళ్లి ఎంజాయ్ చేయాలని అనుకునే వారు లక్షల్లో కాదు కాదు కోట్లల్లో ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.కొందరు స్నేహితులతో వెళ్తే కొందరు ఫ్యామిలీతో కూడా వెళ్తారు.
గోవా అంటే అదోక అద్బుత ప్రపంచంగా మారిపోయింది.ప్రతి రోజు ఏదో ఒక చోట ఏదో ఒక సినిమా షూటింగ్ జరుపుకుంటూనే ఉంటుంది.
గోవాలో సినిమా షూటింగ్స్కు చాలా అనుకూలం.అలాంటి గోవాకు పర్యటకులను రావద్దంటూ ప్రభుత్వం హెచ్చరించింది.
రాబోయే వారం రోజుల పాటు వాతావరణం అస్సలు బాగుండదని, అందుకే గోవాకు ట్రిప్ పెట్టుకున్న వారు క్యాన్సిల్ చేసుకోవడం మంచిది అంటూ హెచ్చరించింది.ప్రభుత్వం నుండి ఇలాంటి ప్రకటన రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది.
వాతావరణం ఎంత ప్రతికూలంగా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు.వర్షాలు ఇప్పటికే భారీగా కురుస్తున్నాయి.
ఇవే వర్షాలు మరో వారం రోజులు కొనసాగే అవకాశాలు ఉన్నాయి.అదే జరిగితే గోవా మొత్తం నీటితో మునిగి పోయే ప్రమాదం ఉంది.
అందుకే ప్రయాణికులు వచ్చి ఇబ్బందులకు గురి అవ్వొద్దు అంటూ ప్రభుత్వం సూచించింది.మీరు కనుక ఈ వారం పది రోజుల్లో గోవా పోయే ప్లాన్ చేసుకుంటే రద్దు చేసుకోండి.
మీ స్నేహితులకు కూడా ఈ విషయాన్ని చెప్పండి.