ఆ దర్శకుడికి అదే పెద్ద మైనస్ అంటున్న నిర్మాత....

గతంలో సీనియర్ దర్శకుడు వంశీ దర్శకత్వం వహించిన టువంటి ఏప్రిల్ 1 విడుదల అనే చిత్రం ఇప్పటికీ ప్రేక్షకులకు బాగా బాగా గుర్తుంటుంది.

ఇందులో హీరోగా నటించినటువంటి రాజేంద్రప్రసాద్ కెరియర్లోనే ఈ చిత్రం మంచి హిట్ గా నిలిచింది.

అయితే ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన టువంటి గొట్టిముక్కల పద్మారావు దర్శకుడు సీనియర్ వంశీ పై పలు విమర్శలు చేశాడు.తాజాగా గొట్టిముక్కల పద్మారావు ఓ ప్రముఖ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు.

 ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ సీనియర్ వంశీ ఎవరితోనూ పెద్దగా కలవడనీ, అంతేగాక ఏ విషయాలను కూడా ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడడని అన్నారు.తన పని తాను చేసుకుపోతూ ఉంటాడని, నిర్మాతల మాటలు కూడా అస్సలు పట్టించుకోడని ఆన్నారు.

ఈ విషయాలే ఆయనకి పెద్ద మైనస్ గా నిలిచాయని అన్నారు.అంతేగాక ఇలాంటి విషయాల వల్లే ఒకానొక దశలో సినిమా అవకాశాలు కూడా కోల్పోయాడని అన్నారు.

Advertisement

అయితే గోపి గోపిక గోదావరి, అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, డిటెక్టివ్ నారద వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించినటువంటి దర్శకుడు వంశీ ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమకు కొంత కాలంగా  దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఒకసారి కట్టిన చీరను స్నేహ మరి ముట్టుకోరా.. అదే కారణమా?
Advertisement

తాజా వార్తలు