గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తనపై కేసు నమోదు కావడంపై కీలక వ్యాఖ్యలు చేశారు.పోలీసుల కేసులకు తాను భయపడనని చెప్పారు.
లవ్ జిహాద్ గురించి మాట్లాడినందుకు తనపై ముంబైలో కేసు పెట్టారని తెలిపారు.ఉద్దేశ పూరితంగా మాట్లాడొద్దని కోర్టు హెచ్చరించిందన్నారు.
కానీ తాను ధర్మం కోసమే పోరాడుతున్నానని స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలో దేనికైనా రెడీ అని వెల్లడించారు.
కావాలనే తనపై పీడీయాక్ట్ పెట్టారని స్పష్టం చేశారు.