టాలీవుడ్ సీనియర్ హీరోల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు.ఈయన ఇటీవలే అఖండ సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.
ఆ తర్వాత మరొక మాస్ డైరెక్టర్ ను లైన్లో పెట్టాడు.క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమాను స్టార్ట్ చేసాడు.
మైత్రి మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఈ యువ దర్శకుడు హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు.
ఈ సినిమాపై నందమూరి ప్రేక్షకులు భారీ ఆశలు పెట్టుకున్నారు.
ఇద్దరు మాస్ వ్యక్తులు రంగంలోకి దిగడంతో సినిమా నెక్స్ట్ రేంజ్ లో ఉంటుందని ఫ్యాన్స్ ఆతృతగా ఉన్నారు.ఇప్పటికే ఈ సినిమా నుండి బాలయ్య లుక్ రివీల్ అయ్యింది.
ఈ లుక్ వచ్చిన తర్వాత మాస్ ప్రేక్షకులు మొత్తం ఈ సినిమాపై మరిన్ని హోప్స్ పెంచుకుని బాలయ్య విధ్వంసమైన నటన కోసం ఎదురు చూస్తున్నారు.
ఫ్యాన్స్ ఈ సినిమా నుండి కొత్త అప్డేట్ ఇవ్వాలని డైరెక్టర్ ను కొన్ని రోజులుగా అడుగు తున్నారు.
ఇటీవలే ఈ సినిమా నుండి మచ్చుకకు ఒక పిక్ వదిలాడు గోపీచంద్.దీనికే ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయారు.
ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నుండి రాఖీ పౌర్ణమికి ఒక అదిరిపోయే అప్డేట్ ను రెడీ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది.
మరి ఈ సినిమా టైటిల్ కోసం ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ ఇప్పుడు కొత్త అప్డేట్ రాబోతుంది అనే వార్త రావడంతో ఇది టైటిల్ అనౌన్స్ మెంట్ అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.చూడాలి ఈ పండుగకు ఎలాంటి అప్డేట్ ఇస్తారో.ప్రెసెంట్ షూట్ జరుపుకుంటున్న ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుంటే.కీలక పాత్రల్లో విజయ్ దునియా, వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్నారు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.