గగ్గోలు పెడుతున్న గాడ్ ఫాదర్ బయ్యర్స్‌.. మెగాస్టార్ పై రుసరుస

మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా అక్టోబర్ 5వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

ప్రమోషన్ కార్యక్రమాలు ఆశించిన స్థాయిలో చేయక పోవడంతో సినిమాను భారీ మొత్తానికి కొనుగోలు చేసిన బయ్యర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమాను దాదాపుగా 200 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది.మెగాస్టార్ చిరంజీవి తన గత చిత్రం ఆచార్య తో నిరాశ పర్చిన కూడా ఈ సినిమాపై మంచి అంచనాలు ఉండడంతో బిజినెస్ భారీ ఎత్తున జరిగింది.

ఆ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలు చేయడం లేదు అనేది ఇప్పుడు బయ్యర్ల వాదన.సినిమా విడుదలకు రెండు వారాల ముందు ప్రమోషన్ కార్యక్రమాలు మొదలవుతాయని ప్రకటించారు.

కానీ ఇప్పటి వరకు మెగాస్టార్ చిరంజీవి ఇంటర్వ్యూ తప్పితే పెద్దగా హడావుడి లేదు.ఈ విషయమై ఇండస్ట్రీ వర్గాల్లో మరియు మెగా అభిమానుల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది.

Advertisement

మెగాస్టార్ చిరంజీవి చాలా బద్ధకంగా ఈ సినిమా విషయంలో ఉన్నాడంటూ కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇదే సమయంలో గాడ్ ఫాదర్ సినిమాను మరి భారీ అంచనాల నడుమ విడుదల చేయకుండా కొద్దిపాటి అంచనాలతో విడుదల చేయాలని ఉద్దేశంతోనే సినిమాకు భారీ ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు చేయడం లేదు అనేది కొందరి మాట.అసలు విషయం ఏదైనా కూడా గాడ్ ఫాదర్ సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలు జరగకపోతే కచ్చితంగా ఓపెనింగ్స్ పై ప్రభావం పడే అవకాశం ఉందంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అక్టోబర్ 5వ తారీఖున నాగార్జున నటించిన ది ఘోస్ట్ సినిమా కూడా విడుదలకు సిద్ధమైంది.

కనుక ఆ సినిమాతో పోటీ తట్టుకోవాలంటే గాడ్ ఫాదర్ సినిమాకు కాస్త ఎక్కువగానే పబ్లిసిటీ చేయాల్సి ఉంది.ఆ దిశగా చిరంజీవి మరియు చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోషన్ కార్యక్రమాలు చేయడం లేదనేది బయ్యర్ల ఆందోళన.

అందుకే మెగాస్టార్ చిరంజీవి పై బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు కాస్త అసహనంతో ఉన్నారట.మెగాస్టార్ సినిమా కనుక జనాలు కచ్చితంగా రావడం ఖాయం.అయితే సినిమా సక్సెస్ దక్కించుకుంటేనే భారీ వసూలు నమోదు అవుతాయి.

ప్రమోషన్ భారీగా చేసినంత మాత్రాన భారీ వసూలు ఉండవు అనేది కొందరి వాదన.

వదిన సురేఖ వద్ద రెండు కోట్లు అప్పు తీసుకున్న పవన్ కళ్యాణ్.. ఆస్తుల చిట్టా ఇదే?

Advertisement

తాజా వార్తలు