గంగ జాతర సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి( Bhumana Karunakar Reddy ) ఆధ్వర్యంలో గంగమ్మ భక్తి చైతన్య యాత్ర అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు.అనంతవీధిలోని పూర్వపు తిరుమల ముఖద్వారానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, సారెతో భక్తి చైతన్య యాత్ర ప్రారంభమైంది.
వందలాది మంది భక్తులు( Devotees ) విచిత్ర వేషధారణలలో గంగమ్మ శోభాయాత్ర ఊరేగింపులో పాల్గొన్నారు .అనంతవీధి నుంచి గంగమ్మ శోభాయాత్రలో ప్రత్యేక ఆకర్షణ నిలిచారు తిరుపతి ఎంపీ గురుమూర్తి.పుష్ప2 వేషధారణలో ఎమ్మెల్యే తో పాటు ఊరేగింపులో పాల్గొన్నారు
.