తెలుగు చిత్ర పరిశ్రమలో రౌడీ హీరోగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం దుబాయ్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే.ప్రస్తుతం ఈయన నటిస్తున్న ఖుషి సినిమా షూటింగ్ వాయిదా పడటంతో ఈయన వెకేషన్ వెళ్తూ తన ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఫ్యామిలీతో కలిసి దుబాయ్ ట్రిపు వెళ్లినటువంటి విజయ్ దేవరకొండ అక్కడ ఓ జూ ను సందర్శించారు.ఈ క్రమంలోనే జూలో ఉన్నటువంటి క్రూరం మృగాలతో విజయ్ దేవరకొండ ఎంతో చిల్ అవుతూ కనిపించారు.
సాధారణంగా క్రూర మృగాలను చూస్తే మనం భయంతో ఉనికి పోతాము అయితే ఈయన మాత్రం సరదాగా వాటితో ఆడుకుంటూ వాటికి పాలు పట్టించడమే కాకుండా భయంకరమైన కొండచిలువలను ఏకంగా మెడలో వేసుకొని ఫోటోలకు ఫోజులిచ్చారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా వైరల్ అయ్యాయి.వీటిని చూస్తేనే ఒళ్ళు గోగ్గురు పుడుతోంది అలాంటిది ఈయన పాములను మెడలో వేసుకొని సింహం పులుల పిల్లలకు పాలు పట్టిస్తూ సరదాగా ఫోటోలకు ఫోజులిచ్చారు.
నిజానికి తనకు పాములంటే చాలా భయమని అయితే జ్యూ సిబ్బంది సహాయంతో తాను ఇలా కొండచిలువలతో గడిపానని తెలిపారు.తనకు ఎంతగానో సహకరించినందుకు జూ సిబ్బందికి విజయ్ దేవరకొండ కృతజ్ఞతలు తెలిపారు.తాను సింహం పులులతో మాట్లాడటానికి తనకు సహకరించిన జూ సిబ్బంది, క్యూరేటర్స్ కి స్పెషల్ థాంక్స్ అని చెప్పుకొచ్చారు.
ఈ ట్రిప్ తన జీవితంలో ఒక తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుంది అంటూ ఈయన క్రూర మృగాలతో పాములతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.