వింత: ఏపీలో ఆ ప్రాంతంలో కప్పల వర్షం కురిసిందట!

తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే.

కొన్ని ప్రాంతాలలో భారీగా వర్షాలు కురుస్తూ ఉంటే కొన్ని ప్రాంతాలలో మాత్రం ఓ మోస్తరుగానే వర్షాలు కురుస్తున్నాయి.

ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే రైతన్నల మాత్రం.ఆనందంలో మునిగిపోయారు.

ఈ ఏడాది వానాకాలం ప్రారంభమైనప్పటి నుంచి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.ఇక తెలుగు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.

వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడంతో మొన్నటి వరకు బీడుగా ఉన్న భూములు అన్నింటిలో ప్రస్తుతం రైతులు ఎంతో ఆనందంగా పంటలు వేస్తున్నారు.అయితే తాజాగా తాడిపత్రిలో.

Advertisement

మూడు గంటల పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది.వర్షం కురవడం మామూలే కదా దాంట్లో కొత్త ఏముంది అని అంటారా.

అయితే మామూలుగా వర్షం కురవలేదు కప్పలతో కూడిన వర్షం కురవడంతో ఏకంగా స్థానికులు అందరూ షాకయ్యారు.పైనుంచి వర్షపు చినుకుల తో పాటుగా కప్పలు కూడా కింద పడ్డాయి.

దీంతో వాటి బెకబెక లతో ప్రాంతం మొత్తం దద్దరిల్లిపోయింది.అటు కప్పల తో కూడిన వర్షం పడడంతో స్థానికులు సైతం షాకయ్యారు.

సెల్ ఫోన్ తీసి వాటిని చిత్రీకరించి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో అదికాస్తా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు