అశ్విని హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని భాకూరు పల్లె తండాలో అశ్విని హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి అభినవ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని శుక్రవారం రోజున ప్రారంభించారు.

ఈ వైద్య శిబిరంలో రోగులకు ఉచితంగా రక్త పరీక్షలు చేసి అవసరమున్నవారికి ఉచితంగానే మందులు ఇవ్వడం జరుగుతుందని అలాగే కంటి సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమున్న వారికి కూడా కంటి అద్దాలు ఉచితంగానే అందజేయడం జరుగుతుందని వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, హాస్పిటల్ వైద్య సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి

Latest Rajanna Sircilla News