నూకలమర్రిలో ఉచిత బస్సు పాసుల పంపిణీ!

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి లో ఉచిత బస్ పాసులను వైస్ ఎంపీపీ జక్కుల కవిత తిరుపతి విద్యార్థులకు అందించారు.

నమిలిగుండపల్లి మరియు నూకలమర్రి విద్యార్థి విద్యార్థులకు బస్సు సౌకర్యార్థం బస్సు పాసులు ఇవ్వడాన్ని చాలా సంతోషంగా భావిస్తూ మాకు అవకాశం ఇచ్చిన ఆర్టీసీ డిపో మేనేజర్ మురళి కృష్ణ, శ్రీనివాస్ యాదవ్ అలాగే నూకలమర్రి బిజెపి నాయకులందరికీ జడ్.

పి.హెచ్.ఎస్ హైస్కూల్ హెడ్మాస్టర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు.

విద్యార్థులు మంచిగా చదివి ఉపాధ్యాయులకు గ్రామానికి కుటుంబ సభ్యులకు మంచి పేరు తేవాలని, భవిష్యత్తులో వాళ్ళు ఎన్నో ఉన్నతమైన హోదాలు అధిరోగించాలని కోరుతూ పిల్లలందరూ చెడు అలవాట్లకు దూరంగ ఉండాలని చిన్ననాటి నుంచి విద్య అభ్యసించినట్టయితే మేధస్సు పెరుగుతుందన్నారు.ముఖ్యంగా మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండాలని ఉపాధ్యాయులు చెప్పిన ప్రతి విషయాన్ని సీరియస్ గా తీసుకొని చదివి ఉన్నత శిఖరాలకు చేరాలని చెప్పి కోరుకుంటూ భవిష్యత్తులో మా వంతు సహకారంగా ఇలాంటి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పెండ్యాల తిరుపతి, డిపో మేనేజర్ మురళి కృష్ణ,హై స్కూల్ హెచ్ఎం తిరుపతి,స్కూల్ చైర్మన్ దేవరాజం,బీజేపి గ్రామ కమిటీ సభ్యులందరూ పాల్గొన్నారు.

Advertisement
రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి

Latest Rajanna Sircilla News