ఏపీలో వైసీపీ, జనసేన మధ్య ఫ్లెక్సీ వార్ కొనసాగుతోంది.ఈ క్రమంలో విజయనగరంతో పాటు ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో ఫ్లెక్సీల రగడ చెలరేగింది.
పేదలు, పెత్తందారులకు మధ్య యుద్ధమంటూ వైసీపీ భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది.ఈ క్రమంలో వైసీపీకి కౌంటర్ గా జనసేన పార్టీ కూడా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది.
అటు ఒంగోలులో మాజీ మంత్రి బాలినేని అనుచరులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేయగా వాటిని జనసేన కార్యకర్తలు చింపివేశారు.మరోవైపు జనసేన ఫ్లెక్సీలను వైసీపీ కార్యకర్తలు తొలగించడంతో ఇరు పార్టీ నేతల మధ్య వివాదం కొనసాగుతోంది.
ఈ క్రమంలోనే వైసీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలంటూ జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు.లేని పక్షంలో లీగల్ గా ముందకు వెళ్తామని స్పష్టం చేశారు.