సికింద్రాబాద్ లో భారీ అగ్నిప్ర‌మాదం..

సికింద్రాబాద్ లో భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది.రూబీ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ షోరూమ్ లో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి.

మంట‌ల్లో చిక్కుకుని ఎనిమిది మంది స‌జీవ ద‌హ‌న‌మ‌య్యారు.ప‌లువురు తీవ్రంగా గాయప‌డ్డారు.

బాధితుల‌ను గాంధీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.సెల్లార్ లో ఈ-స్కూట‌ర్ బ్యాట‌రీలు పేల‌డంతో ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది.

భ‌వ‌నం ఫ‌స్ట్ ఫ్లోర్ లో లాడ్జ్ క‌మ్ హోట‌ల్ ఉంది.ఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు మంట‌లతో పాటు పొగ ద‌ట్టంగా అలుముకోవ‌డంతో ఊపిరాడ‌క చ‌నిపోయిన‌ట్లు స‌మాచారం.

Advertisement
ఆ విషయంలో ప్రభాస్, నాని గ్రేట్ అంటున్న అభిమానులు.. అసలేమైందంటే?

తాజా వార్తలు