ప్రపంచంలో ఏడు వింతలు ఉంటాయి అని అనేవారు.కానీ ఇప్పుడు మాత్రం ఎక్కడ చూసినా వింత వింత ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.
ఎదో ఒక చోట ఎదో ఒక వింత ఘటనలు బయటపడుతూనే ఉన్నాయి.అలాంటి వింత ఘటన ఒకటి ముంబై లో కూడా చోటుచేసుకుంది.
ఎక్కడైనా మహిళల కడుపులో గర్భాశయం అనేది ఉంటుంది.
ఆ గర్భాశయం లేకపోతే ఆ మహిళ కు తల్లి అయ్యే అవకాశం కూడా ఉండదు అని అంటారు.అదే గర్భాశయం పురుషుడి కడుపులో ఉంటె.ఊహించుకోవడానికే వింతగా ఉన్నా నిజంగా ఒక పురుషుడి కడుపులో గర్భాశయం ఉన్న ఘటన వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే ముంబైలోని జేజే హాస్పిటల్లో 29 ఏళ్ల యువకుడికి రెండేళ్ల క్రితం వివాహమైంది.అయితే రెండేళ్లు అవుతున్నా సంతానం కలగకపోవడం తో ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు.
అయితే ఆ పరీక్షల్లో వైద్యులు ఆశ్చర్యపోయేలా దృశ్యం ఒకటి కంటపడింది.
ఆ యువకుడి శరీరంలో గర్భసంచి ఉన్నట్టుగా పరీక్షల్లో తేలింది.యువకునిలో ఆ అవయవాన్ని చూసి అవాక్కయిన వైద్యులు వెంటనే సర్జరీ చేసి గర్భాశయాన్ని తొలగించారు.అయితే చికిత్స కోసం వచ్చిన వ్యక్తి పురుషుడు కావడంతో ఇది వింతైన ఘటనగా భావిస్తున్నారు.
వైద్యులు కూడా ఇది వైద్య చరిత్రలో అరుదైన ఘటన అని ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 200 మంది ఇలా గర్భశయాన్ని కలిగి ఉన్నారని డాక్టర్లు చెబుతున్నారు.