తమిళనాడు( Tamil Nadu )లోని మధురైలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.మధురై నేషనల్ హైవేపై వేగంగా వచ్చిన ఓ కారు బైకులను ఢీకొట్టి పల్టీ కొట్టింది.
ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు.

ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీ కెమెరా( CCTV camera )లో రికార్డ్ అయ్యాయి.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు కారు అతివేగమే ప్రమాదం జరగడానికి కారణమని తెలిపారు.







