లాభదాయక పంటలపై రైతులకు అవగాహన కల్పించాలి:కలెక్టర్

సూర్యాపేట జిల్లా:లాభదాయక పంట సాగుపై వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉండి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత కేశవ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.శుక్రవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో వ్యవసాయ అధికారులతో రైతులకు అందుతున్న పలు పథకాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

 Farmers Should Be Made Aware Of Profitable Crops: Collector-TeluguStop.com

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ శాఖలో ప్రస్తుతము అమలవుతున్న పథకాలపై రైతులు అవగాహన కలిగి ఉండాలని సూచించారు.జిల్లాలో ఎక్కడకూడా పంట వివరాల నమోదు (crop booking) పక్కాగా ఆన్లైన్ లో నమోదుచేయాలని, పంటల సాగు ముమ్మరంగా జరుగుచున్న ఈ సీజనులో వ్యవసాయ విస్తరణ అధికారులు,మండల వ్యవసాయ అధికారులు,సహాయ వ్యవసాయ సంచాలకులు,జిల్లా వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని అలాగే రైతు వేదికల ద్వారా లాభదాయక పంటలపై అవగాహన కల్పించాలని సూచించారు.

నిరంతరం క్షేత్ర స్థాయి పర్యటనలు చేస్తూ సలహాలు,సూచనలు రైతులకు అందించాలని ఆదేశించారు.ఈ సీజన్ లో రైతులకు ఎటువంటి కొరత లేకుండా ఎరువులను అన్ని మండలాలలో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

అనంతరం క్లస్టర్స్ వారీగా రైతులకు అందుతున్న పలు పథకాలపై అధికారులతో కలిసి సమీక్షించారు.ఈ సమీక్ష సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి రామారావు నాయక్,సహాయ వ్యవసాయ సంచాలకులు,మండల వ్యవసాయాధికాలు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube