కరీంనగర్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.పర్యటనకు వెళ్లిన మంత్రి కేటీఆర్ ను ఏబీవీపీ నాయకులు అడ్డుకున్నారు.
ఈ నేపథ్యంలో ఉద్యోగ నియామకాలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు.కారు దిగుతుండగా కేటీఆర్ ను ముట్టడించే ప్రయత్నం చేశారు.
దీంతో ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలను అడ్డగించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.