గంజాయి, మత్తు పదార్థాలను తరమి కొట్టడంలో ప్రతి విద్యార్థులు భాగస్వామ్యం కావాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్( District SP Akhil Mahajan ) ఆదేశాల మేరకు ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే పరిణామాల పై అవగాహన కల్పించిన ఎల్లారెడ్డిపేట సీఐ శ్రీనివాస్ గౌడ్.

ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ యువత, విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిస కాకుండా మంచిగా చదువుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని తెలిపారు.మత్తు పదార్థాలకు మానసికంగా బానిస కావడం ద్వారా అనుకోకుండా నేరాలు చేసే అవకాశం ఉంటుందని, యువత విద్యార్థులు గంజాయి, మత్తు పదార్థాలను తరిమికొట్టడంలో భాగస్వామ్యం కావాలని ఈ సందర్బంగా విద్యార్థులకు పిలుపునిచ్చారు.మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా యువత బంగారు భవిష్యత్తుకు బాటలు వెయ్యాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో టిఎస్ఎన్ఎబి ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి,, ఎల్లారెడ్డిపేట ఎస్ ఐ ఎన్.రమాకాంత్,కాలేజీ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడితే కఠిన చర్యలు తప్పవు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.

Latest Rajanna Sircilla News