నమ్రత శిరోద్కర్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన నమ్రత ఆ తర్వాత హీరో మహేష్ బాబుని వివాహం చేసుకొని సినిమాలకు దూరం అయింది.
సినిమాలకు దూరమైనప్పటికీ నమ్రత భార్యగా, తల్లిగా తన బాధ్యతలు చక్కగా నిర్వహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది.మహేష్ బాబు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు.
దీంతో మహేష్ బాబు సినిమాలకు సంబంధించిన వ్యవహారాలతో పాటు అతని వ్యాపారాలకు సంబంధించిన పనులు కూడా నమ్రత చెక్కబడుతూ వ్యాపారవేత్తగా కూడా మంచి గుర్తింపు పొందింది.
ప్రస్తుత కాలంలో సినిమా అవకాశాల కోసం భార్యలు తమ భర్తలకు దూరమవుతున్నారు.కానీ నమ్రత మాత్రం మహేష్ బాబుని ప్రేమించి వివాహం చేసుకొని అతని కోసం అతని కుటుంబం కోసం సినిమాలకు దూరం అయింది.ఇలా ఇంటి బాధ్యతలు, వ్యాపార బాధ్యతలు చక్కగా నిర్వహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.
ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నమ్రత తరచూ తన కుటుంబానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.తాజాగా నమ్రత తన తండ్రి ఫోటోని షేర్ చేస్తూ చాలా ఎమోషనల్ అయింది.
ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
నమ్రత తన తండ్రి నితిన్ శిరోద్కర్ను ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.” 16 ఏళ్లుగా నిన్ను మిస్ అవుతూనే ఉన్నా పప్పా.నీ ప్రతి జ్ఞాపకం నా మదిలో అలాగే పదిలంగా ఉండిపోయింది.
ఏమీ మారలేదు.నువ్వు చాలా త్వరగా మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయావు పప్పా.
ప్రతి రోజూ అనంతమైన ప్రేమను, వెలుగులను నిత్యం నీకు పంపిస్తూనే ఉంటాను’ అని నమ్రత చాలా ఎమోషనల్ గా రాసుకొచ్చింది .ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.ఇలా ఇటీవల గౌతమ్ మొదటిసారిగా తన తోడు లేకుండా ఒంటరిగా విదేశాలకు వెళ్లినప్పుడు కూడా తనని మిస్ అవుతూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది.