అవకాశాలు ఎక్కడ ఉంటే జనాలు అక్కడికి వెళ్తారు.చాలా మంది భారతీయులు ఇతర దేశాలకు వెళ్లి అక్కడ స్థిరపడుతున్నారు.
అలాగే ఇతర దేశాల్లో పుట్టిన వారు ఇండియాలోనూ పౌరసత్వం పొంది ఉంటున్నారు.అలాగే విదేశాల్లో పుట్టి భారత్ తరఫున క్రికెట్ ఆడిన వారు చాలా మంది ప్లేయర్లు ఉన్నారు.
ఇంతకీ ఇండియా తరుపున ఆడిన ఆ విదేశీ క్రికెటర్లు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
రాబిన్ సింగ్ ఇతడు పుట్టింది వెస్టిండీస్ దేశంలో.
ట్రినిడాడ్ అంట్ టొబాగో సమీపంలో ఉన్న ప్రిన్సెస్ టౌన్లో రాబిన్ సింగ్ జన్మించాడు.ఇతడు భారత్ తరఫున 136 వన్డేలు ఆడాడు.
ఒకే ఒక టెస్టు మ్యాచ్ ఆడాడు.జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.
సలీమ్ దురానీ
సలీమ్ దురానీ అప్ఘనిస్థాన్ లోని కాబూల్ లో జన్మించాడు.1934లో పుట్టిన ఈ ఆల్ రౌండర్.భారత్ నుంచి 29 టెస్టులు ఆడాడు.తన కెరీర్ లలో 1,202 రన్స్ చేశాడు.వీటిలో ఒక సెంచరీ ఉంది.75 వికెట్లు పడగొట్టాడు.
ఖోఖన్ సేన్
బంగ్లాదేశ్ లో పుట్టిన ఖోఖన్ సేన్ భారత్ నుంచి 14 టెస్టులు ఆడాడు.165 పరుగులు చేశాడు.ఇతడిని ప్రొబిర్ కుమార్ సేన్ అని కూడా పిలుస్తారు.
లాల్ సింగ్
మలేషియాలో పుట్టిన లాల్ సింగ్ టీమిండియా తరుపున ఒక టెస్టు ఆడాడు.1932లో ఇంగ్లండ్తో ఆడిన మ్యాచ్ లో బరిలో దిగాడు.44 పరుగులు చేశాడు.
అశోక్ గండోత్రా
ఇతడు బ్రెజిల్ లో జన్మించాడు.భారత క్రికెట్ టీం నుంచి రెండు టెస్టులు ఆడాడు.54 పరుగులు చేశాడు ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు 54 ఆడాడు ఢిల్లీ, బెంగాల్ టీంలకు క్రీడాకారుడిగా కొనసాగాడు.అనంతరం క్రికెట్ నుంచి వైదొలిగాడు.
అటు భారత్ కు చెందిన చాలా మంది ప్లేయర్లు విదేశీ క్రికెట్ టీములకు ఆడినవారు ఉన్నారు.అక్కడ తమ ఆటతో మంచి గుర్తింపును సైతం పొందారు.