నేటి నుండి పాదయాత్ర స్టార్ట్ చేస్తున్న ఈటల..

ఈటల రాజేందర్ హుజరాబాద్ ఉప ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని అన్ని విధాల రెడీ అవుతున్నారు.

నియోజకవర్గంలో మంత్రిగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధిని తెలియజేస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఉన్నా ఈటల తాజాగా నేటి నుండి నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టడానికి రెడీ అయ్యారు.

ప్రజా దీవెన యాత్ర అనే పేరుతో చేపడుతున్న ఈ పాదయాత్ర దాదాపు ఇరవై రెండు రోజులు నియోజకవర్గంలో జరిగేలా ఈటల రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు.రెండు వందల కిలో మీటర్లకు పైగా ఈ పాదయాత్ర నియోజకవర్గంలో జరగనున్నట్లు సమాచారం.

పాదయాత్రలో ప్రతి ఒక్కరిని కలుస్తూ ఉప ఎన్నికలకు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత బయటికి తీసుకువచ్చేలా ఈటల వ్యూహాలు సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఎట్టి పరిస్థితుల్లో హుజరాబాద్ ఉప ఎన్నికలలో గెలిచి టిఆర్ఎస్ పార్టీకి గట్టి కౌంటర్ ఇవ్వాలని ఈటల డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

మరోపక్క ఈటల భార్య జమున కూడా పోటీ చేసే అవకాశం ఉన్నట్లు ఇటీవల ఆమె తెలిపింది.ఇద్దరిలో ఎవరో ఒకరు పోటీ చేసిన.

Advertisement

ఒకే గుర్తు పై పోటీ చేయడం జరుగుతుందన్నారు.మరో పక్క కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు ఈటల కి మంచి పోటీ ఇచ్చే అభ్యర్థిని దింపాలని వెతుకులాట స్టార్ట్ చేశాయి.

తెలంగాణ లోక్ సభ ఎన్నికల బరి నుంచి తప్పుకున్న సీపీఎం..!!

Advertisement

తాజా వార్తలు