చాలామంది డబ్బులతో బాధపడుతూ ఉంటారు.ఇక నొప్పులను భరించలేక పెయిన్ కిల్లర్లను( Pain Killer ) కూడా వాడుతూ ఉంటారు.
అందుకే పెయిన్ కిల్లర్స్ బదులుగా సహజ సిద్ధంగా లభించే ఎప్సమ్ సాల్ట్ వాడితే కచ్చితంగా చాలా మంచి ఫలితాలు ఉంటాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.ఇక దీనిని మెగ్నీషియం సల్ఫేట్ అని కూడా అంటారు.
అయితే ఈ ఉప్పును పొడిగా చేసి స్టోర్ చేసుకోవాలి.ఈ ఎప్సమ్ సాల్ట్( Epsom Salt ) తో మసాజ్ చేసుకోవడం వలన కూడా నొప్పులు( Muscle Pains ) చాలా ఈజీగా తగ్గిపోతాయి.

అలాగే కండరాలకు ఉపసమాన్ని కలిగిస్తాయి.దీంతో నొప్పిని తగ్గించడంలో ఈ సాల్ట్ చాలా బాగా ఉపయోగపడుతుంది.ఇక మెగ్నీషియం సల్ఫేట్ కండరాల్లో ఉండే కణజాలాల్లోకి వెళ్లి నొప్పిని తగ్గించేందుకు ఇది దోహదపడుతుంది.ఇక నొప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు ముందుగా శరీరానికి ఆవ నూనె రాసుకోవాలి.
ఆ తర్వాత ఎప్సమ్ సాల్ట్ ను పొడిగా చేసుకొని శరీరానికి రాసుకొని మసాజ్ చేసుకోవాలి.ఇలా చేస్తే కండరాలు( Muscles ) విశ్రాంతికి గురై నొప్పులు చాలా త్వరగా తగ్గిపోతాయి.
ఇలా మసాజ్ చేసుకున్న తర్వాత వేడి నీళ్లతో స్నానం చేయాలి.
ఇలా చేస్తే నొప్పుల నుండి కచ్చితంగా ఉపశమనం లభిస్తుంది.
అలాగే నొప్పులతో బాధపడేవారు బాత్ టబ్ లో వేడి నీటిని నింపాలి.ఆ తర్వాత ఇందులో 150 నుండి 200 గ్రాముల వరకు ఎప్సమ్ వేసి కలిపి ఆ నీటిలో 15 నుండి 20 నిమిషాలు పాటు ఉంటే నొప్పులు చాలా త్వరగా తగ్గిపోతాయి.
ఇక పాదాల నొప్పులు, చేతుల నొప్పులతో బాధపడేవారు గిన్నెలో లేదా బకెట్లో వేడి నీటిని తీసుకోవాలి.ఇక అందులో పాదాలను, చేతులను ఉంచాలి.

ఇలా 20 నిమిషాల పాటు చేస్తే పాదాల నొప్పులు, పిక్కల నొప్పులు, చేతుల నొప్పులు చాలా త్వరగా తగ్గిపోతాయి.అలాగే నొప్పులు ఎక్కువగా ఉన్నవారు వేడి నీటిలో ఆ సాల్ట్ ను వేసి తర్వాత ఆ నీటిని కాపడం పెట్టుకోవాలి.ఇలా చేస్తే నొప్పులు సులభంగా తగ్గుతాయి.ఈ విధంగా ఎప్సమ్ సాల్ట్ నాచురల్ పెయిన్ కిల్లర్( Natural Pain Killer ) గా పనిచేస్తుంది.దీనిని ఉపయోగిస్తే నొప్పులు తగ్గిపోతాయి.అలాగే దీనివల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కూడా రావని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.