మిస్టర్ ట్వీట్ గా ఎలాన్ మస్క్..!

టెస్లా అధినేత, ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్ మిస్టర్ ట్వీట్ గా పేరు మార్చుకున్నారు.ట్విట్టర్ లో తన ప్రొఫైల్ పేరు ఛేంజ్ చేసుకున్నారు మస్క్.

దీంతో ఎలాన్ మస్క్ ట్విట్టర్ లో ఇక మిస్టర్ ట్వీట్ గానే కొనసాగనున్నారు.పేరును తిరిగి మార్చకునేందుకు ఎలాంటి అవకాశం ఉండదు.

తాను కొత్త పేరుకు స్టిక్ అవ్వాల్సిందేనని, తిరిగి పాత పేరుకు మారడానికి ట్విట్టర్ అనుమతించదని మస్క్ స్వయంగా ప్రకటించారు.అయితే, ట్విట్టర్ కు వ్యతిరేకంగా కోర్టులో వాదనలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో అటార్నీ అనుకోకుండా మిస్టర్ ట్వీట్ అని సంబోధించారంట.ఆ పదం విపరీతంగా నచ్చడంతో మస్క్ తన ప్రొఫైల్ కు మిస్టర్ ట్వీట్ అని నామకరణం చేశారని తెలుస్తోంది.

Advertisement
వీవీప్యాట్లపై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు..!

తాజా వార్తలు