ఏపీలో టీడీపీ కూటమిని ప్రజలు నమ్మడం లేదని వైసీపీ నేత పోతిన మహేశ్( Pothina Mahesh ) అన్నారు.రాష్ట్రంలో రాబోయే 25 ఏళ్లు సీఎంగా జగనే ఉంటారని తెలిపారు.
లక్షల కోట్లు సంపాదించాలనేది చంద్రబాబు, పవన్ కల్యాణ్ లక్ష్యమని పోతిన మహేశ్ ఆరోపించారు.మహిళలు అంటే పవన్ కల్యాణ్ కు( Pawan Kalyan ) చిన్నచూపన్నారు.
అసలు మహిళలను గౌరవించడం పవన్ కల్యాణ్ కు తెలియదని విమర్శించారు.
వర్మకి( Varma ) రెండో భార్య పవన్ అన్న ఆయన అందుకే వంగి వంగి దండాలు పెట్టాడని ఎద్దేవా చేశారు.
గతంలో చిరంజీవిని పవన్ అవమానించారన్న పోతిన మహేశ్ అవసరం కాబట్టి ఇప్పుడు చిరంజీవి గుర్తుకు వచ్చారని పేర్కొన్నారు.కాపు యువత పవన్ పల్లకి మోయాలనుకుంటే… పవన్ మాత్రం చంద్రబాబు పల్లకి మోస్తున్నారని విమర్శలు చేశారు.