దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 74 ఏళ్లు అయ్యాయి.అయితే స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా లేదు.
ఆగస్టు 15వ తేదీ నుంచి ఆ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో విద్యుత్ ని అందించింది కేంద్ర ప్రభుత్వం.
కుప్వారా జిల్లాలో వాస్తవాధీన రేఖ పరిధిలో ఉన్న కెరెన్ గ్రామంలో ప్రభుత్వం ఆగస్టు 15న విద్యుత్ ను అందించింది.రెండో విడతలో భాగంగా మాచిల్ సర్కిల్ పరిధిలోని 20 గ్రామాలకు విద్యుత్ సరఫరా చేస్తున్నారు.24 గంటల పాటు ఈ ప్రాంతాల్లో విద్యుత్ ఉంటుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.ఇప్పటివరకు ఈ ప్రాంతాల్లో కేవలం డీజిల్ జనరేటర్లతో విద్యుత్ ను అందించేవారు.కరెంట్ లైన్లను, ఎలక్ట్రికల్ గ్రిడ్ ను ఏర్పాటు చేయడంతో ఇక్కడ 24 గంటలు కరెంటు ఉంటుందని విద్యుత్ శాఖ ప్రధాన కార్యదర్శి రోహిత్ కన్సాల్ అన్నారు.
ప్రస్తుతం సర్కిల్ పరిధిలోని 9 గ్రామాలకు విద్యుత్ అందిస్తున్నామని, ఇంకొద్ది రోజుల్లో మిగిలిన గ్రామాలకు పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా చేస్తామని ఆయన పేర్కొన్నాడు.సరిహద్దుల్లోని సమస్యాత్మక ప్రాంతాల్లో వచ్చే ఏడాదిలోపు గ్రిడ్ లను ఏర్పాటు చేస్తామన్నారు.
ఈ సెక్టార్ లో 25వేల మందికి ప్రయోజనం చేకూరుతుందని కుప్వారా జిల్లా కలెక్టర్ అన్షుల్ గార్డ్ తెలిపారు.