తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మరో రెండు రోజులు మాత్రమే ఉండటంతో బీజేపీ ప్రచారాన్ని హోరెత్తిస్తుంది.ఇందులో భాగంగా పార్టీ అగ్రనేత అమిత్ షా మక్తల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్ ను నిర్ణయించే ఎన్నికలని అమిత్ షా అన్నారు.రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్నారు.
మక్తల్ లో వంద పడకల ఆస్పత్రి హామీ ఏమైందన్న అమిత్ షా మక్తల్ కు డిగ్రీ కాలేజీ ఇచ్చారా అని ప్రశ్నించారు.కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని సూచించారు.
బీఆర్ఎస్ కాంగ్రెస్ కు బీ టీమ్ లా పని చేస్తుందని ఆరోపించారు.ఈ క్రమంలో కాంగ్రెస్ కు ఓటు వేస్తే బీఆర్ఎస్ కు వేసినట్లేనని వెల్లడించారు.