CM Jagan Election Campaign : ఈ నెల 18 నుంచి సీఎం జగన్ ఎన్నికల ప్రచారం..!!

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీఎం జగన్( CM Jagan ) ప్రచారానికి రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు.ఈ మేరకు ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల ప్రచారాన్ని( Election Campaign ) మొదలుపెట్టాలని సీఎం జగన్ భావిస్తున్నారు.ఈ క్రమంలోనే ఇచ్చాపురం లేదా నర్సీపట్నం నుంచి ప్రచారం ప్రారంభించాలని నిర్ణయించారని తెలుస్తోంది.2019 ఎన్నికల్లోనూ నర్సీపట్నం నుంచే సీఎం జగన్ ప్రచారాన్ని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.

 Election Campaign Of Cm Jagan From 18th Of This Month-TeluguStop.com

ఈ తరహాలోనే ఈ నెల 18 నుంచి ప్రచారాన్ని మొదలు పెట్టనున్న సీఎం జగన్ రోజుకు మూడు నియోజకవర్గాల్లో పర్యటించే అవకాశం ఉంది.ఇందులో భాగంగా బహిరంగ సభలతో( Public Meetings ) పాటు రోడ్ షోలు( Road Shows ) నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే రూట్ మ్యాప్ పై పార్టీ నేతలతో సీఎం జగన్ చర్చించారు.కాగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడానికి ముందు ఈ నెల 16న సీఎం జగన్ ఇడుపులపాయకు వెళ్లనున్నారు.

వైఎస్ఆర్ ఘాట్ లో దివంగత నేత వైఎస్ఆర్ కు ఘన నివాళులు అర్పించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube