మరో క్రేజీ సీక్వెల్‌కు రెడీ అంటోన్న డైరెక్టర్

టాలీవుడ్‌లో పెళ్లిచూపులు చిత్రంతో అదిరిపోయే గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు తరుణ్ భాస్కర్.

ఆ తరువాత ఆయన తెరకెక్కించే ప్రతి సినిమాకు మంచి అంచనాలు ఏర్పడం అలవాటుగా మారిపోయింది.

ముఖ్యంగా ఆయన తెరకెక్కించిన ‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమాకు ఆ సమయంలో ఎలాంటి అంచనాలు క్రియేట్ అయ్యాయో అందరికీ తెలిసిందే.ఈ సినిమాలో నలుగురు హీరోలు ఉండటంతో ఈ సినిమా కొత్త ట్రెండ్‌ను సృష్టించడం ఖాయమని అందరూ అనుకున్నారు.

కట్ చేస్తే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ పరంగా విజయం అందుకోకపోయినా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.ఇక ఆ సినిమాలో ఒక హీరోగా నటించిన విశ్వక్ సేన్ ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.

అయితే యూత్‌ను బాగా అలరించిన ఈ నగరానికి ఏమైంది చిత్రానికి సీక్వెల్ ఖచ్చితంగా ఉంటుందని గతంలోనే దర్శకుడు తరుణ్ భాస్కర్ అన్నాడు.దీంతో ఈ సీక్వెల్ సినిమా ఎప్పుడు తెరకెక్కుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Advertisement

అయితే ఈ సినిమాను త్వరలోనే పట్టాలెక్కించేందుకు దర్శకుడు తరుణ్ భాస్కర్ తెలిపాడు.కాగా ఇటీవల ఈ సినిమాలో నటించిన అభినవ్ గోమటమ్ ఈ చిత్రం సీక్వెల్ గురించి ఓ క్లారిటీ ఇచ్చేశాడు.

ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు అభినవ్ ఈ సినిమా సీక్వెల్ ఈ ఏడాది చివరికల్లా ప్రారంభం అవుతుందని, వచ్చే ఏడాదిలో ఈ సినిమా రిలీజ్ కావడం ఖాయమని ఆయన తెలిపాడు.మొత్తానికి ఈ నగరానికి ఏమైంది చిత్ర సీక్వెల్ విషయంపై ఓ క్లారిటీ రావడంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు తెరకెక్కుతుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.

ఇక ఈ సినిమాలో మరింత ఎంటర్టైన్మెంట్ ఉండబోతున్నట్లు చిత్ర దర్శకుడు అంటున్నాడు.మరి ఈ సినిమాలో హీరోలుగా మళ్లీ ఆ నలుగురే నటిస్తారా లేక వేరే వారు నటిస్తారా అనేది చూడాలి.

ఆ ఒక్కరు తప్ప మిగతా కంటెస్టెంట్లు వేస్ట్.. 12 మంది తీసుకురావడమే బెటర్..?
Advertisement

తాజా వార్తలు