తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి మెగా వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.రామ్ చరణ్ రెండు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు.
ఇక ఈ ఏడాది మరికొన్ని రోజులలో ముగియనున్న నేపథ్యంలో మెగా ఫాన్స్ రామ్ చరణ్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.ఈ క్రమంలోనే ఈ ఏడాది రామ్ చరణ్ కు చాలా స్పెషల్ అంటూ అభిమానుల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మరి ఈ ఏడాది రామ్ చరణ్ కు ఎందుకు స్పెషల్ అనే విషయానికి వస్తే.
రామ్ చరణ్ 2020 సంవత్సరంలో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ కొన్ని 2008, 2010,2011,2021 సంవత్సరాలలో ఈయన ఒక్క సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు.
ఇకపోతే ఈ ఏడాది మాత్రం రామ్ చరణ్ మొదటి సారిగా ఒకే క్యాలెండర్లో రెండు సినిమాలు విడుదల కావడం విశేషం.ఇందులో ఒకటి పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోగా మరొక సినిమా డిజాస్టర్ గా నిలిచింది.
అయితే ఈ సినిమాలో తన తండ్రితో కలిసి పూర్తిస్థాయి చిత్రంలో నటించారన్న సంతృప్తి రామ్ చరణ్ కు మిగిలింది.
ఓకే క్యాలెండర్లో రెండు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.అదేవిధంగా రాజమౌళి దర్శకత్వంలో చేసిన తర్వాత ఏ హీరో కూడా శంకర్ దర్శకత్వంలో సినిమా చేయలేదు కానీ రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తూ మరో రికార్డు సృష్టించారు.రాజమౌళి త్రిబుల్ ఆర్ సినిమాలో మల్టీ స్టార్ చిత్రంగా నటించిన చరణ్ ఆచార్య సినిమాలో కూడా తన తండ్రితో కలిసి మల్టీ స్టార్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఇక రాంచరణ్ కి ఓ మీడియా సంస్థ ది ట్రూ లెజెండ్ అవార్డును ప్రకటించింది.ఈ విధంగా రామ్ చరణ్ కు ఈ ఏడాది చాలా స్పెషల్ గా మారిందని అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.