ప్రస్తుతం మనదేశంలో చలి కాలం నడుస్తోంది.దానివల్ల మన దేశ వ్యాప్తంగా చలి తీవ్రత ఎక్కువగా ఉంది.
చలికాలంలో ఉష్ణోగ్రతలు చాలా వరకు తగ్గిపోయి ఉంటాయి.చలి ఎక్కువగా ఉండటం వల్ల ప్రతిరోజు చాలామందికి స్నానం చేయాలని ఉండదు.
ఇలాంటి పరిస్థితులను చాలామందికి ప్రతిరోజు స్నానం చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది.అందువల్ల చాలామంది హీటర్ ద్వారా నీటిని వేడి చేసుకుని స్నానం చేస్తూ ఉంటారు.
చల్లటి నీరుతో స్నానం చేసిన తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు. పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోక్ ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంది.
కానీ చలికాలంలో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.ఇలాంటి పరిస్థితులలో సీరియస్ గా తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఏదో ఒక సందర్భంలో ప్రమాదం వచ్చే అవకాశం ఉంది.
అందుకే చలికాలంలో చల్లటి నీటితో స్నానం చేసే ముందు ఒకసారి ఆలోచించాలని వైద్యులు చెబుతున్నారు.
చలికాలంలో వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయో, దాదాపు అన్ని నష్టాలు కూడా ఉన్నాయి.శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది.అయితే రోజు వేడి నీళ్లతో తల స్నానం చేస్తే గుండె సమస్యలు తగ్గే అవకాశం ఉంది.
రోజు వేడి నీళ్లతో స్నానం చేసేవారిలో ఆరోగ్య సమస్యలు చాలా తక్కువగా ఉంటాయని ఒక అధ్యయనంలో తెలిసింది.చల్లని నీటితో స్నానం చేయడం వల్ల కొన్ని కొన్ని సందర్భాలలో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆలస్యం చేయకుండా బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు కనిపిస్తే మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం మంచిది.బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.శరీరంలో ఏ భాగంలోనైనా తిమ్మిర్లు వస్తూ ఉంటాయి.శరీరంలో బలహీనత, తీవ్రమైన తలనొప్పి, వాంతులు వికారం ఉండే అవకాశం ఉంది.
మాట్లాడేటప్పుడు తడబడే అవకాశం ఉంది.