పవన్ కళ్యాణ్ హీరో గా దగ్గుబాటి రానా ముఖ్య పాత్ర పోషించిన సినిమా బీమ్లా నాయక్ ఈ సినిమా కి సాగర్ కే చంద్ర డైరెక్షన్ చేసారు.ఈ సినిమా మలయాళం సినిమా అయినా అయ్యప్పనం కోషియం సినిమా కి రీమేక్ గా రూపొందింది.
మలయాళం సూపర్ హిట్ అయింది దాంతో తెలుగులో ఈ సినిమాని రీమేక్ చేయాలనే ఉదేశ్యం తో సితార ఎంటర్టైన్మెంట్ అధినేత అయిన ప్రొడ్యూసర్ నాగ వంశీ ఈ సినిమా రీమేక్ హక్కులని కొన్నారు.దాంట్లో భాగంగానే ఈ సినిమాలో ఎవరిని హీరోగా తీసుకోవాలని వంశీ ఆలోచిసున్నప్పుడు అయన బాలయ్య బాబు అయితే ఈ క్యారెక్టర్ కి బాగా సెట్ అవుతాడు అనుకోని బాలయ్య బాబు కి ఈ విషయం చెపితే అప్పుడు బాలయ్య బాబు వంశీ తో ఈ సినిమా నాకంటే పవన్ కళ్యాణ్ కి బాగా సెట్ అవుతుంది అని చెప్పి ఆయనతో చేయి మంచి హిట్ అవుతుంది అని చెప్పాడట దాంతో పవన్ కళ్యాణ్ దగ్గరికి ఈ కథ వెళ్లడం జరిగింది అలా పవన్ ఇమేజ్ కి తగ్గట్టు గా గురుజి త్రివిక్రమ్ మార్పులు చేర్పులు చేసాడు.పవన్ కళ్యాణ్ హీరోగా సెట్ అయ్యాడు ఈ సినిమా ప్రకారం ఇంకో క్యారెక్టర్ అయిన డానియల్ శేఖర్ గా ఎవరైతే బాగుంటుంది అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ రానా అయితే ఈ క్యారెక్టర్ కి బాగుంటాడు అని చెపితే అతన్ని తీసుకోవడం జరిగింది…
ఆతర్వాత డైరెక్టర్ గా సాగర్ కే చంద్ర హీరోయిన్ గా నిత్యా మీనన్ రానా వైఫ్ గా సంయుక్త మీనన్ ని తీసుకున్నారు.అలా ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లి చాలా తొందరగా షూటింగ్ ముగించుకొని రిలీజ్ అయింది ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఒక మంచి సినిమా గా చెప్పవచ్చు…అలా బాలయ్య బాబు చేయాల్సిన సినిమా పవన్ కళ్యాణ్ చేసాడు…ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేయాల్సి ఉంది.
అలాగే యంగ్ డైరెక్టర్ అయిన సుజిత్ డైరెక్టన్ లో కూడా ఓజి అనే సినిమా కూడా చేయబోతున్నాడు రెండు రోజుల క్రితమే ఈ సినిమాకి సంభందించిన పూజ కార్యక్రమాలు కూడా జరిగాయి… కానీ ఈ సినిమాలన్నీ ఎలక్షన్స్ తర్వాతే ఉంటాయని తెలుస్తుంది ఎందుకంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన పార్టీని వచ్చే ఎన్నికలకి సిద్ధం చేస్తున్నాడు.ఇక ఇది ఇలా ఉంటె రానా కూడా కొన్ని క్రేజి ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీ గా ఉన్నాడు…
.