మ‌చ్చ‌లు పోయి ముఖం మొత్తం ఒకే రంగులో మెర‌వాలంటే ఇలా చేయండి!

మచ్చలు లేని మెరిసే ముఖ చర్మాన్ని ఎవరు కోరుకోరు చెప్పండి.ముఖ్యంగా మగువలు అటువంటి చర్మం కోసం తెగ ఆరాట పడుతుంటారు.

ఈ క్రమంలోనే ఖరీదైన ఫేస్ క్రీములను కొనుగోలు చేసి వాడుతుంటారు.త‌ర‌చూ చర్మంపై ఏవేవో ప్రయోగాలు చేస్తూ ఉంటారు.

కానీ ఎన్ని చేసినా కొన్ని కొన్ని మచ్చలు చర్మ సౌందర్యాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తుంటాయి.పైగా మచ్చల వల్ల స్కిన్ టోన్ అన్ ఈవెన్ గా మారుతుంటుంది.

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే రెమెడీని ట్రై చేశారంటే ఎలాంటి మ‌చ్చ‌లైనా ప‌రార్ అవ్వ‌డమే కాదు ముఖ చ‌ర్మం మొత్తం ఒకే రంగులో మెరుస్తుంది.మ‌రి ఇంత‌కీ ఆ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.

Advertisement

ముందుగా ఒక చిన్న సైజ్ బీట్ రూట్ ను తీసుకుని తొక్క తొలగించి వాటర్ లో శుభ్రంగా కడిగి సన్నగా తురుముకోవాలి.ఈ బీట్ రూట్ తురుము నుంచి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల‌ ముల్తానీ మట్టి, వ‌న్‌ టేబుల్ స్పూన్ పాల పొడి, రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, హాఫ్ టేబుల్ స్పూన్ జాజికాయ పొడి వేసుకుని కలుపుకోవాలి.చివరిగా సరిపడా బీట్ రూట్ జ్యూస్ ను కూడా వేసి అన్నీ కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి.

ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ఏదైనా బ్ర‌ష్‌ సహాయంతో ముఖానికి కాస్త మందంగా అప్లై చేసుకోవాలి.అనంతరం ముఖాన్ని ఓ ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.కంప్లీట్ గా డ్రై అయిన అనంతరం చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రంగా కడిగి.

ఏదైనా మాయిశ్చ‌రైజ‌ర్‌ లేదా సీరమ్‌ను అప్లై చేసుకోవాలి.రోజుకు ఒకసారి ఈ రెమెడీని పాటించడం వల్ల చర్మం పై ఎలాంటి మచ్చలు ఉన్నా క్రమంగా మాయం అవుతాయి.

రాజాసాబ్ సినిమా వచ్చేది అప్పుడేనా..?మారుతి ఎందుకంత స్లో గా వర్క్ చేస్తున్నాడు...
సింప్లిసిటీకి పర్‌ఫెక్ట్‌ ఎగ్జాంపుల్‌ ప్రభాస్‌.. వైరల్ అవుతున్న శిరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు!

అలాగే చర్మం మొత్తం ఒకే రంగులోకి మారి అందంగా మరియు కాంతివంతంగా మెరుస్తుంది.

Advertisement

తాజా వార్తలు