నేడు భారతదేశ వ్యాప్తంగా ప్రజలు దీపావళి పండుగ( Diwali )ను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.అందరికీ ఎంతో ఇష్టమైన ఈ పండుగ వేళ పిండి వంటలు చేయడమే కాకుండా ఇళ్లు కూడా శుభ్రంగా క్లీన్ చేసుకుంటారు.
అయితే ఇంటిని శుభ్రం చేస్తున్నప్పుడు కొందరికి అనుకోని సంపద దొరుకుతుంది.ఆ ఇంట్లో పూర్వీకులు దాచిన బంగారం, నగదు దొరుకుతుంది.
ఇటీవల ఒక మహిళ దీపావళికి ఇంటిని శుభ్రం చేస్తుండగా, పాత 500 మరియు 1000 రూపాయల కట్టలు కనుగొన్నది.ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఆమె భర్తకు తెలియకుండా చాలా కాలం క్రితం దాచిపెట్టిన ఆ డబ్బు గురించి మర్చిపోయిందట.
ఈ అనుకోని సంఘటనపై ఆశ్చర్యంతో ఆమె తీసిన వీడియో ఇన్స్టాగ్రామ్లో 22 మిలియన్ల మందికి చేరుకొని, 50 వేలకు పైగా లైక్లు అందుకుంది.చాలా మంది నెటిజన్లు ఈ వీడియోకి స్పందిస్తూ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు ఆ పాత నోట్లను కనుగొన్న ఆమె వీడియో చూసిన కొంతమంది, ఆ నోట్లను భవిష్యత్తులో పాత వస్తువులు సేకరించే వారికి ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చు అని అన్నారు.వాటి విలువ 50 రెట్లు పెరగవచ్చని, అంటే ఇవి మంచి పెట్టుబడి అని కూడా కొందరు అన్నారు.
మరికొందరు ఆర్బీఐలో వాటిని మార్చుకోవచ్చని సూచించారు.కొంతమంది ఆ నోట్ల పాత డిజైన్ను చాలా అందంగా చెప్పారు.
కానీ, మరికొందరు ఆ నోట్లకు ఇప్పుడు విలువ లేదని ఆమెను ఓదార్చారు.వచ్చే తరాల కోసం జ్ఞాపకంగా వాటిని దాచుకోవచ్చని కూడా చెప్పారు.
ఇదిలా ఉండగా ఇటీవల ముంబై( Mumbai ) నివాసి లీనా మాథ్రే (55) దీపావళికి కొంతమంది పని వాళ్ల చేత ఇంటిని శుభ్రం చేయించింది.అదే సమయంలో నాలుగు లక్షల రూపాయల విలువైన బంగారం దొంగతనం అయింది.ఆమె ఒక మొబైల్ యాప్ ద్వారా ఈ పని వాళ్ళను కుదుర్చుకుంది.ఆ క్లీనర్లే ఈ దొంగతనానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.శుభ్రం చేయించిన తర్వాత తన పెట్టె తెరిచి ఉన్నట్లు, బంగారం లేదని గమనించిన లీనా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటివి ఫుటేజ్ను పరిశీలించిన పోలీసులు, 27 ఏళ్ల అర్బాజ్ ఖాన్ అనే వ్యక్తిని ప్రధాన నిందితుడిగా అరెస్టు చేశారు.
ఇంకో ఇద్దరు వ్యక్తులు, సంతోష్ ఒంప్రకాష్ యాదవ్, సుఫియాన్ నజీర్ అహ్మద్ సౌదర్లను కూడా గుర్తించి విచారిస్తున్నారు.