టాలీవుడ్
లో గత సంవత్సరం ఏప్రిల్ నెలలో విడుదలైనటువంటి మజిలీ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.అయితే ఈ చిత్రంలో హీరోగా
అక్కినేని నాగచైతన్య
నటించగా సమంత అక్కినేని, దివ్యాంశ కౌశిక్ కథానాయికలుగా నటించారు.
ఈ చిత్రానికి టాలీవుడ్లో ప్రముఖ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం వహించగా సాహు గరిపాటి నిర్మాతగా వ్యవహరించాడు.
అయితే ఈ చిత్రంలో ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో నార్త్ ఇండియన్ అమ్మాయి పాత్రలో నటించినటువంటి
దివ్యాంశ కౌశిక్
తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.
తన అందం అభినయంతో కుర్రకారు మదులు గెలుచుకుంది.ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించినప్పటికీ దివ్యాంశ కౌశిక్ మాత్రం అవకాశాలను దక్కించుకోలేక పోతోంది.అంతేగాక ఈ చిత్రం విడుదలై దాదాపు ఏడాది కావస్తున్నా ఇప్పటికీ దివ్యాంశ కౌశిక్ ఈ చిత్రంలో నటించిన తర్వాత ఇప్పటి వరకు మరో కొత్త చిత్రానికి సంబంధించినటువంటి ఎటువంటి సమాచారం లేదు.

దీంతో దివ్యంశ కౌశిక్ కి ఏమైందా అంటూ అభిమానులు ఆరా తీయడం మొదలు పెట్టారు.అయితే సరిగ్గా ఇలాంటి పరిస్థితి
నాచురల్ స్టార్ నాని
నటించినటువంటి
జెర్సీ
చిత్రంలో హీరోయిన్ గా నటించిన
శ్రద్ధా శ్రీనాథ్
కూడా ఎదుర్కొంటోంది.అయితే ఇటీవల కాలంలో శ్రద్ధాశ్రీనాథ్ ఎట్టకేలకు గుంటూరు టాకీస్ చిత్రంలో హీరోగా నటించిన సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న ఓ చిత్రంలో మూడవ హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది.