నెల్లూరు జిల్లా ఉదయగిరి టీడీపీలో అసంతృప్తి గళం వినిపిస్తోంది.ఈ మేరకు కలిగిరిలో అనుచరులు, అభిమానులతో మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు( Bollineni Ramarao )భేటీ అయ్యారు.
ఈ క్రమంలోనే ఉదయగిరిలో తప్పకుండా పోటీ చేస్తానని తేల్చి చెప్పారు.చివరిగా చంద్రబాబుని కలుస్తానని తెలిపారు.
చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్న పోటీ చేయడం మాత్రం ఖాయమని పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే ఆత్మీయ సమావేశంలో బొల్లినేని కన్నీంటి పర్యంతం అయ్యారు.పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో అండగా ఉన్నానన్నారు.అయితే ఉదయగిరి నియోజకవర్గ టికెట్ ను ఎన్ఆర్ఐ కాకర్ల సురేశ్( kakarla suresh ) కు ఇచ్చే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.టికెట్ తనకు ఇవ్వనందుకు బాధ లేదన్న ఆయన చంద్రబాబు( Chandra babu naidu ) తీరు బాధను కలిగిస్తుందని వాపోయారు.
టీడీపీలో బ్రోకర్లు రాజ్యమేలుతున్నారని ఆరోపించారు.
.