ఢిల్లీలో ఏపీ బీజేపీ రాష్ట్ర ఇంఛార్జ్ మురళీధరన్ తో అసంతృప్తి నేతల భేటీ ముగిసింది.ఇందులో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని మురళీధరన్ కు నేతలు వివరించారు.
అయితే ఏపీ బీజేపీ అసంతృప్త నేతలకు మురళీధరన్ క్లాస్ పీకినట్లు తెలుస్తోంది.ఇంతమంది ఎందుకు ఢిల్లీ వచ్చారని ప్రశ్నించిన ఆయన తను ఏపీకి వచ్చినప్పుడు మాట్లాడొచ్చు కదా అని వ్యాఖ్యనించారు.
అనంతరం రెండు రోజుల్లో రాజమండ్రికి వస్తున్నట్లు పార్టీ నేతలకు తెలిపారు.అప్పుడే అన్ని సమస్యలపై చర్చిద్దామని వెల్లడించారు.
ఏపీ బీజేపీ అధ్యక్షుడి మార్పుపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.ఇకపై నెలలో రెండు రోజులు ఏపీలో పర్యటిస్తానన్నారు.
అయితే మురళీధరన్ తీరుపై సైతం పలువురు బీజేపీ నేతలు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.







