సుజిత్ దర్శకత్వంలో రామ్ చరణ్.. ఫీల్ అవుతున్న అభిమానులు!

దర్శకుడిగారన్ రాజా రన్సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన దర్శకుడు సుజిత్.

మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఈ యంగ్ డైరెక్టర్ ఆ తరువాత ప్రభాస్ హీరోగా పాన్ స్థాయిలో భారీ బడ్జెట్ చిత్రం సాహో చిత్రాన్ని తెరకెక్కించారు.

అయితే ఈ సినిమా అనుకున్నంత అంచనాలను చేరలేకపోయింది.సాహో బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను సందడి చేయలేకపోయినప్పటికీ సుజిత్ దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా మలయాళం సూపర్ హిట్ చిత్రం లూసిఫర్రీమేక్ చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు.

లూసిఫర్ చిత్రానికి సుజిత్ దర్శకత్వం చేస్తున్నాడని భావించినప్పటికీ చివరి నిమిషంలో పలు కారణాల వల్ల లూసిఫర్ అవకాశం చేజారిపోయింది.లూసిఫర్ మిస్ అయినప్పటికీ ఈ యంగ్ డైరెక్టర్ మాత్రం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను దృష్టిలో ఉంచుకొని ఒక పవర్ ఫుల్ కథను తయారు చేసినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే రామ్ చరణ్ కి వినిపించగా ఈ కథ విన్న రామ్చరణ్ ఎంతో ఇంప్రెస్ అయ్యి ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

Advertisement

ఈ క్రమంలోనే వీరి కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతోందని చెప్పవచ్చు.సుజిత్ దర్శకత్వంలో లూసిఫర్ చిత్రం చేజారిపోయిందని అభిమానులు ఫీల్ అయినప్పటికీ మెగా పవర్ స్టార్ హీరోగా మరో సినిమా తెరకెక్కుతుందని తెలియడంతో మెగా అభిమానులు ఖుషీ అవుతున్నారు.అయితే రామ్ చరణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ సినిమాను ఇదివరకే రన్ రాజా రన్ , సాహో చిత్రాలను నిర్మించిన యు.వి.క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి.ఏది ఏమైనా సుజిత్ మెగాస్టార్ ఆఫర్ చేజారిపోయిన మెగాపవర్ స్టార్ ఆఫర్ దక్కించుకున్నారని చెప్పవచ్చు.

ప్రస్తుతం రామ్ చరణ్ రాజమౌళి ఆర్.ఆర్.ఆర్చిత్రంలో నటిస్తున్నారు.అదేవిధంగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఈ రెండూ పూర్తి కాగానే తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు.ఈ సినిమా తర్వాత సుజిత్ సినిమాలో చరణ్ పాల్గొంటారని సమాచారం.

వదిన సురేఖ వద్ద రెండు కోట్లు అప్పు తీసుకున్న పవన్ కళ్యాణ్.. ఆస్తుల చిట్టా ఇదే?

Advertisement

తాజా వార్తలు