రిస్క్‌కు రెడీ అన్న దిల్‌రాజు

అనుష్క హీరోయిన్‌గా ‘రుద్రమదేవి’ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించి గుణశేఖర్‌ పెద్ద సాహసమే చేసిన విషయం తెల్సిందే.

ఒక హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రాన్ని ఏకంగా 80 కోట్లు పెట్టి తీయడం అనేది మామూలు విషయం కాదు.

ఆ సాహసం చేసి సక్సెస్‌ అయిన గుణశేఖర్‌ తన తర్వాత ప్రాజెక్ట్‌ను ‘ప్రతాప రుద్రుడు’ అని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే.ఈసారి హీరో ఓరియంటెడ్‌ చిత్రం అవ్వడంతో ఎంత బడ్జెట్‌ పెట్టిన తిరిగి వచ్చే అవకాశాలున్నాయి.

దాంతో ‘ప్రతాప రుద్రుడు’ చిత్రాన్ని తాను నిర్మిస్తాను అంటూ దిల్‌ రాజు స్వయంగా ప్రకటించాడు.‘రుద్రమదేవి’ సక్సెస్‌ మీట్‌లో పాల్గొన్న దిల్‌రాజు ఈ సందర్బంగా మాట్లాడుతూ.

‘రుద్రమదేవి’ చిత్రాన్ని నైజాం ఏరియాలో పంపిణీ చేసే అవకాశం వచ్చినందుకు గర్విస్తున్నాను.ఇలాంటి చారిత్రాత్మక నేపథ్యంలో సినిమా రావడం చాలా సంతోషం.

Advertisement

ఇక గుణశేఖర్‌ ‘ప్రతాప రుద్రుడు’ చిత్రంకు కథ రెడీ చేస్తే తాను ఆ సినిమాను నిర్మించేందుకు సిద్దంగా ఉన్నాను అన్నాడు.గుణశేఖర్‌ వంటి దర్శకుడితో సినిమా నిర్మించాలి అంటే నిర్మాతకు ఘట్స్‌ ఉండాలి.

ఎప్పుడు ఎలాంటి ఫలితం వస్తుందో ఆయనకే తెలియదు.దాంతో నిర్మాతలు గుణకు కాస్త దూరంగా ఉంటారు.

కాని దిల్‌రాజు మాత్రం ఏ నమ్మకంతోనో ‘ప్రతాప రుద్రుడు’ చిత్రాన్ని నిర్మిస్తాను అంటూ ప్రకటించాడు.త్వరలో ప్రతాప రుద్రుడు పాత్రలో ఎవరు నటించనున్నారో అనే విషయంపై క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి.

2023 లో హీరో కార్తీ ఎన్ని సీక్వెల్ సినిమాలతో వస్తున్నాడో తెలుసా ?
Advertisement

తాజా వార్తలు