వారు డ‌బ్బులిస్తేనే ర‌ఘ‌రామ అలా చేశారా.. జ‌గ‌న్ ప్ర‌భుత్వ వాద‌న‌!

గ‌త కొద్దిరోజులుగా దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఎంపీ ర‌ఘురామ వ్య‌వ‌హారంపై ఇప్పుడు అనేక ర‌కాలుగా ఆరోప‌న‌లు వ‌స్తున్నాయి.దీంతో ఆయ‌న‌కు వ‌రుస షాక్‌లు త‌గులుతున్నాయ‌నే చెప్పాలి.

ఇక ఇప్పుడు ఏపీ ప్ర‌భుత్వం ఆయ‌న‌పై చేసిన ఆరోప‌న‌లు చూస్తే నిజంగానే షాక్ అవ్వాల్సిందే.ఎందుకంటే జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఇంత ప‌క‌డ్బందీగా ఆధారాల‌తో స‌హా వివ‌రాల‌ను బ‌య‌ట పెడుతుంటే ఎవ‌రైనా న‌మ్మాల్సిందే.

ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఎంపీ ర‌ఘురామ‌పై సుప్రీంకోర్టులో వేసిన అఫిడవిట్ సంచ‌ల‌నం రేపుతోంది.ర‌ఘురామ‌పై రాజద్రోహం కేసులో భాగంగా ఈ అఫిడ‌విట్ వేసిన జ‌గ‌న్ ప్ర‌భుత్వం రెబ‌ల్ ఎంపీ రఘురామకు రెండు ప్రముఖ తెలుగు న్యూస్ చానెళ్ల నుంచి డ‌బ్బులు వ‌చ్చాయని, అందుకే ఆయ‌న ఇలా మాట్లాడుతున్నారంటూ జ‌గ‌న్ ప్ర‌భుత్వం సంచ‌ల‌న విష‌యాల‌ను బ‌య‌ట పెట్టింది.

ఆ రెండు తెలుగు న్యూస్ చానెళ్లు చెప్పిన‌ట్టు విని ర‌ఘురామ త‌న ప‌ద‌విని ఉప‌యోగించుకున్నారంటూ ప్ర‌భుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది.

Advertisement

అంతేకాదు న్యూస్ చానెళ్లతో ఈవిధంగా కుట్ర చేయించింది టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ఆయ‌న కొడుకు లోకేష్ అంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది.అందుకు సంబంధించిన ఆధారాల‌ను కూడా సేక‌రించింది వైసీపీ ప్ర‌భుత్వం.ఈరెండు ఛాన‌ళ్ల‌లో ఒక ఛాన‌ల్ చైర్మన్ ఎంపీ రఘురామకు లంచంం కింద రూ.8.8 కోట్లు ఇచ్చి మ‌రీ ఆ విధంగా త‌న ప్ర‌భుత్వంపై కుట్ర చేశారంటూ జ‌గ‌న్ ప్ర‌భుత్వం తెలిపింది.ఇక ర‌ఘురామ కృష్ణంరాజు టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు, అలాగే నారా లోకేష్‌తో ఫోన్‌లో మాట్లాడిన విష‌యాన్ని కూడా పొందుప‌రిచింది.

ఇప్పుడు ఇదే మ్యాట‌ర్ పెద్ద సంచ‌ల‌నంగా మారింది.మ‌రి దీనిపై ఆయ‌న ఏమైనా స్పందిస్తారో లేదోచూడాలి.

Advertisement

తాజా వార్తలు